Amaravati Farmers: అమరావతి రైతుల నిరసనలపై కరోనా ఎఫెక్ట్!

  • మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసు
  • అమరావతి ప్రాంతంలో ఆందోళన
  • నిరసనల కొనసాగింపుపై నేడు నిర్ణయం తీసుకోనున్న రైతులు
Corona virus effect on Amaravati farmers protests

ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు నిరసనలు, ఆందోళనలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఈ నిరసన కార్యక్రమాలపై కూడా పడింది. ఇప్పటికే అమరావతికి సమీపంలో ఉన్న మంగళగిరిలో ఒక కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ కావడంతో... ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో, నిరసన శిబిరాలను కొనసాగించవద్దని రైతులు, మహిళలను అధికారులు కోరారు. దీంతో, ఏం చేయాలన్న దానిపై చర్చించడానికి ఈరోజు ఎక్కడికక్కడ శిబిరాల్లో వారంతా సమావేశం కానున్నారు. అందరి అభిప్రాయాలను తీసుకుని తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.

More Telugu News