Corona Virus: దేశంలో 129కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. నిన్న ఒక్కరోజే 19 కరోనా కేసులు

  • కర్ణాటకలో మొత్తం 10 మందికి కరోనా
  • యూకే నుంచి వచ్చిన 20 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్
  • ప్రపంచ వ్యాప్తంగా 1,82,547 కేసులు
  • ప్రపంచ వ్యాప్తంగా 7,164 మంది మృతి
coronavirus cases in india

భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 129కి చేరింది. నిన్న ఒక్కరోజు 19 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కర్ణాటకలో మొత్తం 10 మందికి కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖ ఈ రోజు ప్రకటన చేసింది. ఇటీవలే యూకే నుంచి వచ్చిన 20 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్నారు.  

చైనాలో పుట్టుకొచ్చిన కరోనా కొవిడ్‌-19 వైరస్‌ ఇప్పటివరకు 162 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 1,82,547 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కారణంగా 7,164 మంది మృతి చెందారు. చైనాలో 3,226, ఇటలీలో 2,158, స్పెయిన్‌లో 342 మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News