Vijay Sai Reddy: అందుకే చంద్రబాబు దివాళాకోరు ప్రయత్నాలు మొదలు పెట్టాడు: విజయసాయిరెడ్డి

  • సొంత రాష్ట్రంలో దిక్కులేని పార్టీకి జాతీయ అధ్యక్షుడంట
  • స్థానికంగా జరిగే చిన్న చిన్న గొడవలను ప్రస్తావిస్తున్నాడు
  • ఏదో అరాచకం జరిగిపోతోందని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం 
  • గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఇటువంటి వైఖరి
vijaya sai reddy fires on chandra babu naidu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు వైఖరిని ఆయన తప్పుబడుతూ ట్వీట్ చేశారు.

'సొంత రాష్ట్రంలో దిక్కులేని పార్టీకి జాతీయ అధ్యక్షుడంట! స్థానికంగా జరిగే చిన్న చిన్న గొడవలను ప్రస్తావిస్తూ ఏదో అరాచకం జరిగిపోతోందని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నాడు. గెలిచే పరిస్థితి లేకపోవడంతో దివాళాకోరు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ మనిషి ఎప్పటికీ మారడు' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

More Telugu News