nagababu: అయినా ఈ దేవుళ్లకి కోపం ఎక్కువే: నాగబాబు

  • ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా గురించి నాగబాబు వ్యాఖ్యలు
  • కొన్ని ప్రముఖ మతాల పెద్దల వ్యాఖ్యలపై సెటైర్‌
  • కరోనాను వాళ్ల దేవుడే భూమి మీదకి పంపించాడట అంటూ ట్వీట్
nagababu about religion and corona

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా జాతికి చెందిన కోవిడ్‌-19 వైరస్‌ గురించి సినీనటుడు, జనసేన నేత నాగబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'కొన్ని ప్రముఖ మతాల పెద్దలు చెప్పిందేమంటే.. కరోనా వైరస్‌ని వాళ్ల దేవుడే ఈ భూమి మీదకి పంపించాడు అని అంటున్నారు. అయినా ఈ దేవుళ్లకి కోపం ఎక్కువే సుమా' అని ట్వీట్ చేశారు.

కాగా, కరోనా వైరస్‌ చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మత పెద్దలు విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. 'మాంసాహారులను దండించడానికి దేవుడు ధరించిన కోపావతారమే కరోనా వైరస్' అని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి ఇటీవలే వ్యాఖ్యానించారు.

More Telugu News