కోడికి కరోనా దెబ్బ.. ఉచితంగా పంచేస్తున్న వ్యాపారులు!
- దారుణంగా పడిపోయిన అమ్మకాలు
- కృష్ణా జిల్లా మైలవరంలో ఉచితంగా కోళ్లు
- 2 వేళ కోళ్లను ఉచితంగా పంచిపెట్టిన వ్యాపారి
ఏపీలో అయితే కిలో చికెన్ రూ. 20-రూ.40 మధ్య విక్రయిస్తున్నారు. అయినప్పటికీ స్పందన అంతంత మాత్రంగానే ఉండడంతో వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవరంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ చికెన్ అమ్మకాలు పూర్తిగా పడిపోవడంతో ఏం చేయాలో పాలుపోని పౌల్ట్రీ వ్యాపారి గువ్వల కుమార్రెడ్డి తన ఫాంలోని 2 వేల కోళ్లను సమీప గ్రామాల ప్రజలకు ఉచితంగా పంచిపెట్టారు.