Chandrababu: కాసేపట్లో గవర్నర్ ను కలవనున్న చంద్రబాబు    

  • వైసీపీ దౌర్జన్యాలపై ఫిర్యాదు చేయనున్న చంద్రబాబు
  • సాక్ష్యాలను సమర్పించనున్న టీడీపీ అధినేత
  • నిన్న పలుచోట్ల చోటు చేసుకున్న హింస
Chandrababu to meet Governor

ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ను కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు కలవనున్నారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైసీపీ శ్రేణులు చేసిన దౌర్జన్యాలపై ఈ సందర్భంగా గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. నామినేషన్లకు చివరి రోజైన నిన్న టీడీపీ అభ్యర్థులపై పలుచోట్ల దాడి జరిగింది. నామినేషన్ పత్రాలను చించేశారు. బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై దాడి కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దాడులకు సంబంధించిన సాక్ష్యాలను కూడా గవర్నర్ కు చంద్రబాబు సమర్పించనున్నట్టు సమాచారం.

More Telugu News