KCR: కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదు: సీఎం కేసీఆర్

  • కాంగ్రెస్ పై విసుగుతోనే బీజేపీకి ఓటేశారన్న కేసీఆర్
  • 50 ఏళ్ల సుదీర్ఘపోరాటం తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిందని వెల్లడి
  • మోదీ సర్కారును నమ్మితే శంకరగిరి మాన్యాలే గతి అని వ్యాఖ్యలు
Telangana CM KCR slams BJP

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలో ఉన్న బీజేపీ చేసిందేమీలేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పై ఉన్న విసుగుతోనే దేశ ప్రజలు బీజేపీకి ఓటేశారని, ఆ విధంగానే బీజేపీ గెలిచిందని అన్నారు. 50 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. పన్నులు వసూలు చేసే బాధ్యత మాత్రమే కేంద్రానికి ఉందని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.

మోదీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే గతి అని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశాన్ని భ్రమింపజేసే పిచ్చి ప్రయత్నంలో కాంగ్రెస్ ఉండేదని, ఇప్పుడు బీజేపీ కూడా ఆ విధంగానే తయారైందని విమర్శించారు. శాసనసభలో బడ్జెట్ చర్చ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆ విధంగా అన్నారు.

More Telugu News