Ab De Villiers: సద్గురు జగ్గీ వాసుదేవ్ తో డివిలియర్స్ ముచ్చట్లు

  • ఈ నెల చివరి వారంలో ఐపీఎల్ ఆరంభం
  • భారత్ చేరుకున్న ఏబీ డివిలియర్స్
  • విజయం సాధించేందుకు ఏబీకి సూచనలు చేసిన సద్గురు
AB de Villiers talks with Sadguru ahead of IPL

మరికొన్నిరోజుల్లో దేశంలో ఐపీఎల్ సందడి మొదలవనుంది. మార్చి 29న ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్న దక్షిణాఫ్రికా వెటరన్ స్టార్ ఏబీ డివిలియర్స్ కొన్నిరోజుల కిందట భారత్ చేరుకున్నాడు. ఈ క్రమంలో డివిలియర్స్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ తో భేటీ అయ్యాడు. సద్గురుతో సంభాషించి మురిసిపోయాడు. డివిలియర్స్ అడిగిన సందేహాలకు సద్గురు ఎంతో ఓపిగ్గా బదులిచ్చారు.

దీనిపై డివిలియర్స్ స్పందిస్తూ, భారత్ లో ఓ అద్భుతమైన వ్యక్తితో మాట్లాడానని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా గురించి, ఆఫ్రికా ఖండం గురించి అమోఘమైన సందేశం ఇచ్చారంటూ కొనియాడాడు. విజయం సాధించాలంటే ఏం చేయాలో చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ ఈ విధ్వంసక వీరుడు ట్వీట్ చేశాడు. అంతేకాదు తమ దేశం రావాలంటూ సద్గురుకు ఆహ్వానం పలకగా, ఆఫ్రికా వచ్చేందుకు తాను కూడా ఎదురుచూస్తున్నానని సద్గురు స్పందించారు.

More Telugu News