దుబాయ్ నుంచి వచ్చి కరోనా టెస్టు ఎగ్గొట్టిన వ్యక్తి కోసం కర్ణాటకలో వేట
- దుబాయ్ నుంచి మంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్న వ్యక్తి
- అధిక జ్వరంతో బాధపడుతుండడంతో కరోనాగా అనుమానం
- వైద్యపరీక్షలు చేయించుకోమనడంతో ఎయిర్ పోర్టు నుంచి అదృశ్యం
అయితే ఆ వ్యక్తి వైద్యపరీక్షలు చేయించుకోకుండా ఎయిర్ పోర్టు నుంచి అదృశ్యమయ్యాడు. దాంతో అధికారులు ఆ ప్రయాణికుడి గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఇప్పుడతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసులు అతడి నివాసం వద్ద ఓ నిఘా బృందాన్ని మోహరించారు. అతడు వస్తే అట్నుంచి అటే ఆసుపత్రికి తరలించాలని పోలీసులు భావిస్తున్నారు.