SA Rahman: వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్

  • జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న రెహమాన్
  • జగన్ నిర్ణయాలను స్వాగతిస్తున్నామని వెల్లడి
  • విశాఖ మేయర్ పీఠాన్ని గెలుస్తామని ధీమా
Former MLA SA Rahman joins YSRCP

గతేడాది చివర్లో టీడీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ, సీఎం జగన్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలను స్వాగతిస్తున్నామని అన్నారు.​ విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన రోజే వైసీపీకి మద్దతు పలికామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖ మేయర్ పీఠాన్ని గెలిచేందుకు ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News