ICICI: ఫోన్ పే వినియోగదారులకు శుభవార్త.. యస్ బ్యాంకు స్థానంలో ఐసీఐసీఐ

  • యస్ బ్యాంకుపై మారటోరియంతో నిలిచిన ఫోన్ పే సేవలు
  • సేవల పునరుద్ధరణలో భాగంగా ఐసీఐసీఐతో జట్టు
  • ఐసీఐసీఐకి థ్యాంక్స్ చెప్పిన సంస్థ సీఈఓ  
Phone pay ready to partner with ICICI Bank

ఫోన్ పే వినియోగదారులకు ఇది శుభవార్తే. ప్రైవేటు రంగ యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన తర్వాత ఈ యాప్ కష్టాల్లో పడింది. ఆ బ్యాంకుతో భాగస్వామిగా ఉన్న ఫోన్‌ పే సేవలపైనా ఆంక్షల ప్రభావం పడింది. దీంతో గత రెండు రోజులుగా ఈ సంస్థల నుంచి సేవలు నిలిచిపోయాయి.

వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఫోన్ పే సేవల పునరుద్ధరణకు ప్రయత్నాలు ప్రారంభించింది. యస్ బ్యాంకు స్థానంలో మరో ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐతో  జట్టు కట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ ముఖ్య కార్య నిర్వహణ అధికారి సమీర్ నిగమ్ ప్రకటించారు. అత్యవసర సమయంలో తమతో కలిసి ఆదుకున్నందుకు ఈ సందర్భంగా ఐసీఐసీఐతోపాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

More Telugu News