శ్రీలంక క్రికెటర్​కు గుర్తుండిపోయే రిటైర్మెంట్​ గిఫ్ట్​ ఇచ్చిన భారత అమ్మాయిలు

Indian Eves Felicitate Sri Lankan Veteran Shashikala
  • ఆటకు గుడ్‌బై చెప్పిన శ్రీలంక ఆల్‌రౌండర్‌‌ శశికళ
  • హర్మన్‌ప్రీత్ జెర్సీని ఆమెకు బహూకరించిన భారత్‌
  • భారత అమ్మాయిల మంచి మనసుపై ఐసీసీ హర్షం
భారత మహిళా క్రికెటర్లు ఆటతోనే కాదు మంచి మనుసుతో కూడా అందరినీ ఆకట్టుకుంటున్నారు. టీ20 వరల్డ్‌కప్‌లో అదిరిపోయే ప్రదర్శనతో అమ్మాయిలు ఇప్పటికే సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. ఇక, ఈ టోర్నీతో తన కెరీర్‌‌కు వీడ్కోలు పలికిన శ్రీలంక వెటరన్‌ క్రికెటర్‌‌ శశికళకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు.

సోమవారం బంగ్లాదేశ్‌పై చివరి మ్యాచ్‌ ఆడిన తర్వాత శశికళ ఆటకు గుడ్‌బై చెప్పింది. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన ఆల్‌రౌండర్‌‌ శశికళ లంకను గెలిపించడంతో పాటు తన ఆఖరి ఆటను చిరకాల జ్ఞాపకంగా మార్చుకుంది. మ్యాచ్‌ తర్వాత లంక డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిన భారత క్రికెటర్లు స్మృతి మంధాన, శిఖా పాండే, జెమీమా రోడ్రిగ్స్‌ ఆమెకు ఓ జెర్సీని బహుమతిగా అందించారు. ఆ జెర్సీ భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ది. దానిపై భారత క్రికెటర్లందరూ సంతకం చేయడంతో పాటు శశికళకు ఆల్‌దిబెస్ట్ చెబుతూ మన జట్టు సందేశం కూడా రాసింది. ఈ ఫొటోను ఐసీసీ తన అధికారిక ట్విట్టర్‌‌లో పోస్ట్‌ చేసింది. ప్రత్యర్థి జట్టు క్రికెటర్‌‌పై భారత అమ్మాయిలు చూపించిన ప్రేమ పట్ల హర్షం వ్యక్తం చేసింది.
Go Back to Shorts
T20 World Cup
India
srilanka
Smriti mandhana
jemima

More Telugu News