Sharwanand: మరోసారి శర్వానంద్ జోడీగా సాయిపల్లవి

  • సాయిపల్లవికి యూత్ లో మంచి క్రేజ్
  • కిషోర్ తిరుమలకి గ్రీన్ సిగ్నల్ 
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
Kishore Thirumala Movie

శర్వానంద్ .. సాయిపల్లవి ఇద్దరూ కూడా వైవిధ్యభరితమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిచ్చేవారే. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'పడి పడి లేచే మనసు' తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమా కంటెంట్ పరంగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. దాంతో ఈ జంటను మళ్లీ తెరపై చూసే అవకాశం రాకపోవచ్చని అనుకున్నారు.

కానీ త్వరలోనే ఈ జంట మళ్లీ అభిమానులకి ఆనందాన్ని కలిగించనుందని తెలుస్తోంది. దర్శకుడు కిషోర్ తిరుమల ఈ ఇద్దరికీ ఒక ప్రేమకథను వినిపించాడట. ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం కిషోర్ తిరుమల .. రామ్ హీరోగా 'రెడ్' సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా విడుదల తరువాత, శర్వానంద్ ను .. సాయిపల్లవిని సెట్స్ పైకి తీసుకెళతాడని అంటున్నారు. రెండోసారైనా ఈ జంట సక్సెస్ ను అందుకుంటుందేమో చూడాలి.

More Telugu News