అసలైన పరుగుకు కంబళ వీరుడు సంసిద్ధం.. 'సాయ్' ఆధ్వర్యంలో శిక్షణకు సై!
- బెంగళూరు కేంద్రంలోనే శిక్షణ
- ఈ మేరకు కుదిరిన ఒప్పందం
- ఈనెలాఖరుతో ముగియనున్న కంబళ పోటీలు
దీంతో అతనికి సరైన శిక్షణ అందజేసి భారత్ తరపున పరుగు పందాలకు పంపాలంటూ నెటిజన్ల నుంచి ప్రతిపాదనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సాయ్ దక్షిణ భారత సంచాలకుడు అజయ్కుమార్ బల్ కాసరగూడ వెళ్లి అమ్మ- తంబ పోటీలను వీక్షించారు.
అనంతరం కంబళ అకాడమీ సమన్వయకర్త గుణపాల్ కదంబతో శ్రీనివాసగౌడకు శిక్షణ అందించే అంశంపై చర్చించారు. శ్రీనివాసగౌడ కూడా శిక్షణకు సై అనడంతో బెంగళూరు కేంద్రంలో ఆయనకు శిక్షణ అందజేయాలని నిర్ణయించారు. ఈనెల చివరి వరకు కంబళ పోటీలు జరుగుతాయి. ఈ పోటీలు ముగిసిన తర్వాత శ్రీనివాసగౌడ సాయ్ శిక్షణకు హాజరవుతారు.