తిరుమలలో అంతంతమాత్రంగా భక్తుల రద్దీ!

Normal Rush in Tirumala
  • 6 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • 8 గంటల్లోపే దర్శనం
  • నిన్న దర్శించుకున్న 68,410 మంది భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి సర్వదర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. వీరికి గరిష్ఠంగా 6 నుంచి 8 గంటల్లో దర్శనం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్లు, రూ. 300 ప్రత్యేక దర్శనం, దివ్య దర్శనం భక్తులకు 3 నుంచి 4 గంటల్లో దర్శనం చేయిస్తున్నామని అన్నారు. నిన్న స్వామివారిని 68, 410 మంది భక్తులు దర్శించుకున్నారని, 25,712 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని, హుండీ ద్వారా 2.32 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
Go Back to Shorts
Tirumala
Tirupati
Piligrims

More Telugu News