Jagan: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారు

  • గన్నవరం నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరతారు
  • 3 గంటలకు అక్కడికి చేరుకుంటారు
  • సాయంత్రం 4.10 - 6 గంటల వరకు ప్రధానితో భేటీ
CM Jagan Delhi tour schedule finalized

ఏపీ సీఎం జగన్ రేపటి ఒక రోజు ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12.45 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి చేరుకోనున్నారు. సాయంత్రం 4.10 గంటల నుంచి 6 గంటల వరకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీ నుంచి తిరిగి గన్నవరం బయలుదేరతారు. రాత్రి 9.40 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకోనున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. కాగా, ప్రధాని మోదీతో భేటీలో పాలనా వికేంద్రీకరణ, ఏపీ శాసనమండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News