తెలంగాణలో పంట పండింది.. రికార్డు స్థాయిలో దిగుబడులు

 Record Production in Agriculture in Telangana
  • ధాన్యం దిగుబడిలో రికార్డు
  • 2019-20 కాలానికి 1.3 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి
  • ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టులు తోడ్పడ్డాయి
తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన తర్వాత వ్యవసాయ దిగుబడులు ఊపందుకున్నాయి. 2019-20 కాలానికి గాను రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వ్యవసాయ దిగుబడులు వచ్చాయని ఆర్థిక గణాంక శాఖ తెలిపింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మునుపెన్నడూ లేని విధంగా దిగుబడులు సాధించడం ఒక రికార్డు అని ఆ శాఖ వెల్లడించింది.

ఒక్క వరి పంట దిగుబడులను గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సారీ 66 లక్షల మెట్రిక్ టన్నులు అదనపు దిగుబడి సాధించి రికార్డు సృష్టించిందని గణాంక శాఖ తెలిపింది. మొత్తంగా రాష్ట్రంలో ఈ ఏడాదిలో 1.3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తిని సాధించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ.. కారణంగా వ్యవసాయంలో దిగుబడులు పెరిగాయని విశ్లేషకులంటున్నారు.
Go Back to Shorts
Telangana
Paddy
Agricultural
Produtions

More Telugu News