Tirumala: సప్తగిరులపై తగ్గిన రద్దీ... 2 గంటల్లోనే సర్వ దర్శనం!

  • రెండు కంపార్టుమెంట్లలో భక్తులు
  • నిన్న స్వామిని దర్శించుకున్న 75 వేల మంది
  • రూ. 3 కోట్లకు చేరువైన హుండీ ఆదాయం
తిరుమలలో రద్దీ గణనీయంగా తగ్గింది. ఈ ఉదయం శ్రీవారి సర్వదర్శనం కోసం కేవలం రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచివుండగా, రెండు గంటల్లోనే దర్శనం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్లు, దివ్య దర్శనం భక్తులు, రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను కలిగిన భక్తులకు కూడా అంతే సమయంలో దర్శనం పూర్తవుతుందని అన్నారు. నిన్న స్వామివారిని 75 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని వెల్లడించిన అధికారులు, సుమారు రూ. 3 కోట్ల హుండీ ఆదాయం లభించిందని తెలిపారు.
Tirumala
Tirupati
TTD
Piligrims

More Telugu News