రైతుల సమస్యలను సీఎం కేసీఆర్ ఒక్కోటి పరిష్కరిస్తున్నారు: మంత్రి హరీశ్ రావు
- నాబార్డు సేవలు ప్రశంసనీయం
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫార్మర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం’
- నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సులో హరీశ్
తెలంగాణ ప్రభుత్వం ‘ఫార్మర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం’ అని అన్నారు. రాష్ట్రంలో రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ సందర్భంగా నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్ 2020-21ని హరీశ్ రావు ఆవిష్కరించారు. ఈ సదస్సులో నాబార్డు సీజీఎం విజయ్ కుమార్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ మయా, ఆంధ్రాబ్యాంక్ ఈడీ కుల్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు.