బీజేపీ సహకారం ఉందని ప్రచారం చేసుకుంటున్నావ్: జగన్ పై కన్నా లక్ష్మినారాయణ ఫైర్
- పాదయాత్రలో పడిన బాధను ప్రజలపై తీర్చుకుంటున్నారు
- మూడు రాజధానులతో అతి పెద్ద అవినీతికి కుట్ర
- జగన్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు
ఇప్పుడు అతిపెద్ద అవినీతికి కుట్ర పన్ని మూడు రాజధానుల కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైన నిర్ణయమని చెప్పారు. ఢిల్లీలో జీవీఎల్ నరసింహారావుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మూడు రాజధానులు చేస్తామని ఎన్నికల సందర్భంగా జగన్ చెప్పలేదని కన్నా అన్నారు. చంద్రబాబు చేసిన అరాచకాలకు విసిగిపోయే జగన్ ను ప్రజలు గెలిపించారని... ఆయన చెప్పిన నవరత్నాల మీద ఆశతో కాదని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. నియంతృత్వ పోకడలతో జగన్ పాలన సాగుతోందని చెప్పారు. తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తానే తీసుకుంటున్నానని దమ్ముంటే జగన్ చెప్పాలని... నువ్వు తీసుకునే ప్రతి పిచ్చి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉందని చేసుకుంటున్న ప్రచారాన్ని బీజేపీ ఖండిస్తోందని అన్నారు.