మోదీ ‘పరీక్షాపే చర్చ’: లక్ష్మణ్, ద్రవిడ్, కుంబ్లే ఆటను మర్చిపోలేమన్న ప్రధాని
- వార్షిక పరీక్షలు దగ్గరపడుతుండడంతో విద్యార్థులతో మోదీ ముఖాముఖి
- ఈడెన్లో ఇండియా-ఆసీస్ టెస్టును గుర్తు చేసిన ప్రధాని
- ఇటువంటి ఘటనల నుంచి స్ఫూర్తిపొందాలని పిలుపు
రెండో ఇన్నింగ్స్లో క్రీజులో పాతుకుపోయిన లక్ష్మణ్ (281), ద్రవిడ్ (180) అద్భుతంగా ఆడి జట్టుకు చారిత్రక విజయాన్ని అందించారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆటగాళ్ల మూడ్ కూడా బాగోలేదని, అలాంటి సమయంలో లక్ష్మణ్, ద్రవిడ్లు ఆడిన ఇన్నింగ్స్ చిరస్మరణీయమని మోదీ అన్నారు. ఆ ఇన్నింగ్స్ను మర్చిపోలేమని, మ్యాచ్ను తిప్పేశారని గుర్తు చేశారు. అలాగే, 2002లో విండీస్తో అంటిగ్వాలో జరిగిన టెస్టులో గాయపడినప్పటికీ కుంబ్లే బౌలింగ్ చేశాడని, ఇలాంటి ఘటనలు మనలో ఉత్తేజాన్ని నింపుతాయని మోదీ పేర్కొన్నారు. ఆశావహ దృక్పథాన్ని పెంపొందించే ఇలాంటి ఘటనల నుంచి మనం స్ఫూర్తిపొందాలని విద్యార్థులకు మోదీ సూచించారు.