తిరుగుబాబు ఇంకా బతికే ఉంది... అమెరికాను హెచ్చరించిన ఇరాన్!
- సులేమానీకి నివాళులు అర్పించిన ఖొమైనీ
- క్షిపణి దాడులు అమెరికాకు చెంపదెబ్బ అంటూ వ్యాఖ్యలు
- అమెరికా ఉనికి ముగించడమే లక్ష్యమంటూ సమరనాదం
పవిత్ర ఖోమ్ నగరంలో ఇరాన్ అగ్రశ్రేణి సైనిక జనరల్ ఖాసిమ్ సులేమానికి నివాళులు అర్పించిన అనంతరం అలీ ఖొమైనీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇరాన్ క్షిపణి దాడిపై బ్రిటన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ఇరాన్ దాడి జరిపింది సంకీర్ణ దళాల స్థావరంపై అని, అందులో తమ బలగాలు కూడా ఉన్నాయని ఆరోపించింది. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించింది.