జగన్ పై నరేంద్ర మోదీ సోదరుడి ప్రశంసల వర్షం!

  • ద్వారకా తిరుమలలో ప్రహ్లాద్ మోదీ
  • జగన్ కష్టసుఖాలు తెలిసిన వ్యక్తని పొగడ్తలు
  • స్వామివారి ధనుర్మాస పూజల్లో ప్రహ్లాద్
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమానికి ఆయన అనునిత్యం శ్రమిస్తున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. ద్వారకా తిరుమలలో జరిగిన ఓ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.

రాష్ట్రంలో దేవతిలకులు, గాండ్లు, తెలకుల వర్గాలకు చెందిన వారు 14 లక్షల మంది వరకూ ఉన్నారని, అన్ని రంగాల్లో వెనుకబడిన ఈ కులస్తుల సమస్యలను తాను జగన్ దృష్టికి తీసుకుని వెళతానని హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రహ్లాద్ మోదీ, ద్వారకా తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుని ధనుర్మాస పూజల్లోనూ పాల్గొన్నారు.
Go Back to Shorts
Narendra Modi
Prahlad Modi
Dwaraka Tirumala
Jagan

More Telugu News