Amaravati: రేపు అమరావతి బంద్ కు పిలుపు నిచ్చిన రాజధాని రైతులు

  • మందడంలో మహిళలపై పోలీస్ దౌర్జన్యానికి నిరసన
  • శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఈడ్చుకెళతారా?
  • పోలీసులపై మండిపడుతున్న రైతులు

రాజధాని ప్రాంతం మందడంలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేశారంటూ అక్కడి రైతులు, మహిళలు మండిపడుతున్నారు. తమపై పోలీసులు దారుణంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రేపు రాజధాని అమరావతి బంద్ కు రైతులు పిలుపు నిచ్చారు.

మహిళలపై పోలీసుల ప్రతాపం దారుణం: నారా లోకేశ్

ఈ ఘటనను టీడీపీ నేత నారా లోకేశ్ ఖండించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళలపై పోలీసులు తమ ప్రతాపం చూపడం దారుణమని అన్నారు. సీఎం జగన్ ని ‘మాట తప్పకండి, మడమ తిప్పకండి’ అని అడగడం తప్పా? అని ప్రశ్నించారు.

More Telugu News