Andhra Pradesh: హైపవర్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే రాజధానిపై ప్రకటన: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే.. రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తుందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానా లేక గ్రామమా ? అని ప్రశ్నించారు. రాజధాని తయారీకి వందేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. పదిశాతం మంది ప్రజలకు మాత్రమే సచివాలయం, హైకోర్టుతో అవసరం ఉంటుందన్నారు. హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత.. శాసనసభను సమావేశపరిచి రాజధానిపై వివరాలను ప్రకటిస్తామని చెప్పారు.
Go Back to Shorts
Andhra Pradesh
Minister
peddireddy
Amaravati
High power committee

More Telugu News