Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

  • మరో నలుగురికి తీవ్ర గాయాలు 
  • చిట్లూరు వద్ద కారును ఢీకొట్టిన లారీ 
  • బాధితులు రాయచోటి, కలికిరి వాసులు

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. చిత్తూరు జిల్లా కలికిరి, కడప జిల్లా రాయచోటికి చెందిన ఎనిమిది మంది కారులో ప్రొద్దుటూరులో జరిగే ఓ శుభ కార్యక్రమానికి వెళ్లారు. 

కార్యక్రమం అనంతరం తిరిగి వస్తుండగా ఈరోజు తెల్లవారు జామున కడప జిల్లా రామాపురం మండలం చిట్లూరు వద్ద కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులను రాయచోటికి చెందిన హర్షద్ ఖాన్, హసజిరా, కలికిరి మండలానికి చెందిన హరునోబాషా, అపిరాగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Road Accident
cuddpha
four died
lorry car collued

More Telugu News