మైదానంలో హాకీ కర్రలతో కొట్టుకున్న ఆటగాళ్లు.. 11 మంది ఆటగాళ్లపై వేటు!
- 56వ నెహ్రూ కప్ హాకీ ఫైనల్లో గొడవ
- తీవ్రంగా పరిగణించిన హాకీ ఇండియా
- ఆరు నెలల నుంచి 18 నెలలపాటు సస్పెన్షన్
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన హాకీ ఇండియా నివేదిక కోరింది. నివేదికలు, వీడియో సాక్ష్యాలను పరిశీలించిన హాకీ ఇండియా రెండు జట్లకు సంబంధించిన 11 మంది ఆటగాళ్లపై వారు చేసిన నేరాన్ని బట్టి 12-18 నెలలు, 6-12 నెలల పాటు సస్పెండ్ చేసింది. ఈ నెల 11 నుంచి శిక్ష అమలు కానుంది. పంజాబ్ సాయుధ పోలీసులకు చెందిన ఇద్దరిని 18 నెలలు, ఐదుగురిని 12 నెలలపాటు సస్పెండ్ చేసింది. పోలీసు జట్టు మేనేజర్ బల్విందర్ సింగ్పై 18 నెలల వేటుపడింది. పంజాబ్ బ్యాంకు ఆటగాళ్లలో ముగ్గురికి 12 నెలలు, ఒకరికి ఆరు నెలలు, మేనేజర్ సుశీల్ కుమార్ దూబేను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.