Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • అనుష్క నాలుగు నెలల కష్టం 
  • 'సరిలేరు నీకెవ్వరు' అప్ డేట్ 
  • 'వెంకీమామ'కు డేట్ ఖరారు 

   *  'నిశ్శబ్దం' సినిమా కోసం కథానాయిక అనుష్క నాలుగు నెలల పాటు కష్టపడిందట. ఈ విషయం గురించి చిత్ర దర్శకుడు హేమంత్ మధుకర్ చెబుతూ, 'ఇందులో ఆమె పెయింటర్ గా నటించారు. అందుకని నాలుగు నెలల పాటు కష్టపడి సైన్ లాంగ్వేజ్, పెయింటింగ్ నేర్చుకున్నారు. ఆ తర్వాతే షూటింగ్ ప్రారంభించాం' అని చెప్పారు.    
*  వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న మహేశ్ బాబు చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంటును జనవరి 5న నిర్వహిస్తారు. అభిమానుల సమక్షంలో నిర్వహించే ఈ వేడుకను ఎక్కడ జరపాలన్న దానిపై ప్రస్తుతం దర్శక నిర్మాతలు చర్చిస్తున్నారు. ఇదిలావుంచితే, నిన్న ఈ సినిమా నుంచి విడుదలైన 'మైండ్ బ్లాక్' చిత్రం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
*  వెంకటేశ్, నాగ చైతన్య కలసి నటించిన 'వెంకీమామ' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించారు. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వెంకటేశ్, చైతూ కలసి మామా అల్లుళ్లుగా నటించారు.   

More Telugu News