Disha: షాద్ నగర్ పోలీస్ స్టేషన్ గేటుకు 'బేడీలు' వేసిన పోలీసులు!

  • షాద్ నగర్ పీఎస్ ఎదుట నిరసనకారుల ఆందోళన
  • పీఎస్ లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం
  • స్టేషన్ గేటును మూసేసిన పోలీసులు

ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులు ప్రస్తుతం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వందల సంఖ్యలో నిరసనకారులు అక్కడకు చేరుకున్నారు. పీఎస్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. అయితే ఏమాత్రం వెనక్కి తగ్గని నిరసనకారులు పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. స్టేషన్ గేటును మూసేశారు. గేటుకు వేయడానికి తాళాలు లేకపోవడంతో... దానికి బేడీలు వేశారు. పీఎస్ గేటుకు బేడీలు వేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.

More Telugu News