Guntru: గుంటూరు జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి.. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన!

  • వినుకొండ మండలం నీలిగంగవరంలో ఘటన
  • విద్యుత్ షాక్ తో గాయాలైనట్టు తొలుత కేసు నమోదు
  • బాధితురాలి సోదరుడి ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజం

గుంటూరు జిల్లాలో ఓ యువతిపై జరిగిన యాసిడ్ దాడి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వినుకొండ మండలం నీలిగంగవరంలో ఈ నెల 6న ఈ ఘటన జరిగింది. ఆ యువతిపై యువకుడు ఆంజనేయులు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. అయితే, ఆ యువతికి కరెంట్ షాక్ తగలడం వల్ల గాయపడినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు అసలు విషయం బయటకొచ్చింది. తన సోదరిపై యాసిడ్ దాడి జరిగిందని తన ఫిర్యాదులో ఆరోపించాడు. కాగా, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ యువతి చికిత్స పొందుతోంది. యువతి స్వస్థలం ప్రకాశం జిల్లా ఉమ్మడివరం.

More Telugu News