టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

  • రాజ్ కోట్ వేదికగా భారత్- బంగ్లాదేశ్ రెండో టీ20 మ్యాచ్
  • పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందన్న కెప్టెన్
  • తన కెరియర్లో 100వ టీ20 ఆడుతున్న హిట్ మ్యాన్
భారత్-బంగ్లా రెండో టీ 20కి వరుణుడి అడ్డంకి తొలగిపోవడంతో మ్యాచ్ నిర్ణీత సమయానికే ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. రాజ్ కోట్ పిచ్ బ్యాటింగుకు అనుకూలిస్తుందన్నాడు. మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, మురళీ కార్తిక్ లు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. జట్టులో మార్పులు లేవని రోహిత్ చెప్పాడు. కాగా, రోహిత్ కిది 100 వ టీ20 మ్యాచ్. మూడు ఓవర్లు ముగిసేసరికి బంగ్లా జట్టు వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది.
Go Back to Shorts
India vs Bangladesh
T20
Rajkot
2nd Match

More Telugu News