Nara Lokesh: పారాణి ఆరకముందే డెంగ్యూతో మరణించింది... ఇంకెంతమంది బలవ్వాలి జగన్ గారూ?: నారా లోకేశ్
రాష్ట్రంలో విషజ్వరాలు ప్రబలుతున్న తీరుపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. కర్నూలులో అన్నెంపున్నెం ఎరుగని ఇద్దరు చిన్నారులు విష జ్వరాలతో మరణించారని, చిత్తూరులో కొత్తగా పెళ్లయిన యువతి కాళ్ల పారాణి కూడా ఆరకముందే డెంగ్యూ జ్వరంతో ప్రాణాలు కోల్పోయిందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంతమంది బలవ్వాలి వైఎస్ జగన్ గారూ? అంటూ నిలదీశారు.