సరిహద్దులో పాకిస్థానీ చొరబాటుదారుడి కాల్చివేత

  • వరిపొలంలో సంచరిస్తుండగా కాల్పులు
  • భారోవల్‌లోని బీఎస్‌ఎఫ్‌ అవుట్‌పోస్టు వద్ద ఘటన
  • వారం రోజుల వ్యవధిలో రెండో ఘటన
పాకిస్థాన్‌ నుంచి భారతదేశ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న చొరబాటుదారుడిని సరిహద్దు భద్రతా బలగాలు కాల్చిచంపాయి. పంజాబ్‌ రాష్ట్ర సరిహద్దులో ఉన్న భారోవల్‌ బీఎస్‌ఎఫ్‌ అవుట్‌పోస్టు వద్ద నిన్నరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వారం రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. ఈనెల 16వ తేదీన కూడా ఓ వ్యక్తిని బలగాలు కాల్చిచంపాయి.

వివరాల్లోకి వెళితే...సరిహద్దు చెక్‌ పోస్టు సమీపంలోని వరిపొలంలో ఓ వ్యక్తి తచ్చాడుతున్నట్టు అనుమానించిన భద్రతా బలగాలు అది వాస్తవమని నిర్థారించుకున్నాయి. భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు అతను ప్రయత్నిస్తున్నాడని గుర్తించి వెనక్కి వెళ్లిపోవాలని హెచ్చరించాయి. అతను తన ప్రయత్నాన్ని ఆపక పోవడంతో కాల్చిచంపినట్టు బీఎస్‌ఎఫ్‌ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఈనెల 16వ తేదీన కూడా సరిహద్దులోని గేట్‌ నంబర్‌ 103 వద్ద భధ్రతా విధులు నిర్వహిస్తుండగా భారత్‌లోకి ప్రవేశించేందుకు గుల్నవాజ్‌ అనే వ్యక్తి ప్రయత్నిస్తూ కనిపించాడు.

అప్రమత్తమైన సైనికులు అతన్ని వెనక్కి వెళ్లాలని హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతను అక్కడికక్కడే చనిపోయాడు. కాగా, పాక్ సరిహద్దుల నుంచి ఫిరోజ్‌పూర్ హుసేనీవాలా సెక్టారులో నిన్న డ్రోన్ల సంచారాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించి వాటిపై కూడా కాల్పులు జరిపారు.
Go Back to Shorts
pakistan boarder
insurjent fired
punjab
BSF

More Telugu News