గాంధీ కోరుకున్న సుపరిపాలన అందించడమే నిజమైన నివాళి: పవన్ కల్యాణ్
- రేపు మహాత్ముడి 150వ జయంతి
- పవన్ ప్రత్యేక సందేశం
- మహాత్ముడి మార్గం సదా ఆచరణీయం అన్న పవన్
ఐన్ స్టీన్, మార్టిన్ లూథర్ కింగ్ వంటి మేధావులను సైతం గాంధీజీ ప్రభావితం చేశారని, ఆయన బోధించిన అహింస, శాంతి, సత్యాగ్రహం వంటి ఆయుధాలు, స్వతంత్ర సాధనలో ఆయన అనుసరించిన మార్గాలు ఇవాళ్టికీ ఆచరణీయమేనని కొనియాడారు. ఆ మహనీయుడు కోరుకున్న సుపరిపాలన అందించడమే ఆయనకు నిజమైన నివాళి అని, అధికారంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆ దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.