ఐరాసలో పాక్ శాశ్వత ప్రతినిధికి షాక్.. వేటేసిన ప్రధాని ఇమ్రాన్
- కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ మద్దతు కూడగట్టడంలో పాక్ విఫలం
- మలీహా లోధీపై ఇమ్రాన్ అసంతృప్తి
- లోధీ స్థానంలో మునీర్ అక్రమ్ నియామకం
ఐరాసలో పాక్ రాయబారిగా వెళ్లడం మునీర్కు ఇది రెండోసారి. 15 ఏళ్ల క్రితం ఐరాసలో పాక్ రాయబారిగా వ్యవహరించిన మునీర్ అప్పట్లో గృహ హింస కారణంగా పదవిని వదులుకున్నారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన ఇమ్రాన్ యుద్ధోన్మాదంతో ఊగిపోయారు. కశ్మీర్ విషయంలో ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్లో కర్ఫ్యూ ఎత్తివేసి చూడాలని భారత ప్రభుత్వానికి సవాలు విసిరారు. కాగా, కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు కూడగట్టడంలో పాక్ విఫలమైన సంగతిని ఇమ్రాన్ స్వయంగా అంగీకరించడం గమనార్హం.