సాహితీవేత్త చందు సుబ్బారావుకు గుర్రం జాషువా అవార్డు
- సీనియర్ రచయిత, విమర్శకుడు, అరసం కార్యదర్శికి దక్కిన గౌరవం
- 28న ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ప్రదానం
- సుబ్బారావు స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని చదలవాడ
ఆరు నవలలు, 40 కథలు, ఐదు విమర్శనాత్మక గ్రంథాలు రాశారు. ఆయన రాసిన ‘చందన చర్చ‘ సుబ్బారావుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నాలుగు పీహెచ్డీలు చేసిన సుబ్బారావు 45 పేపర్లు సమర్పించారు. నాలుగు థీసిస్లు రాశారు. ఈనెల 28వ తేదీన అమరావతిలో జరిగే కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా చందు సుబ్బారావు ఈ అవార్డును అందుకోనున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాషువా రచనలంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన ప్రభావం తనపై ఉందని, అటువంటి తనకు ఆయన పేరుతో ఉన్న అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్నా ఈ అవార్డు తన సాహితీ జీవితంలో ప్రత్యేకమని చెప్పారు.