Hyderabad: తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి పెచ్చులూడి యువతి తలపై పడ్డాయి: ‘మెట్రో’ యాజమాన్యం
అమీర్ పేట్ మెట్రో స్టేషన్ ఆవరణలో పెచ్చులూడి పడి యువతి మౌనిక మృతి చెందిన ఘటనపై మెట్రో యాజమాన్యం వివరణ ఇచ్చింది. తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి పెచ్చులూడిపడ్డాయని పేర్కొంది. చాలా పదునుగా ఉన్న పెచ్చులు ఆమె తలపై పడటంతో బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందినట్టు చెప్పారు.