Kodela: కోడెల మరణవార్తను జీర్ణించుకోలేక.. గుండెపోటుతో మృతి చెందిన అభిమాని

  • కోడెల మరణంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్వర్లు అనే అభిమాని
  • నిన్న రాత్రి 10.30 గంటల సమయంలో గుండెపోటుకు గురైన వైనం
  • కొనసాగుతున్న కోడెల అంతిమయాత్ర

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఇక లేరు అనే వార్తను తట్టుకోలేక మద్దినేని వెంకటేశ్వర్లు అనే ఓ అభిమాని గుండెపోటుకు గురై మరణించారు. నిన్న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆయన గుంటూరులోని డొంకరోడ్డు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.

మరోవైపు, కోడెల అంతిమయాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ సీనియర్లు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అంతిమయాత్రలో పాల్గొంటున్నారు.  

More Telugu News