మోదీ-జిన్ పింగ్ ల మధ్య జరిగే భేటీలో కశ్మీర్ ప్రాధాన్యతా అంశం కాదు: చైనా

  • త్వరలో భేటీ కానున్న మోదీ, జిన్ పింగ్
  • అజెండాలో కశ్మీర్ అంశం ఉండకపోవచ్చన్న చైనా అధికారి
  • ఇరువురు నేతలు వారికి ఇష్టమైన అంశాలపై మాట్లాడతారని వ్యాఖ్య
భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ల మధ్య త్వరలో జరుగనున్న భేటీలో కశ్మీర్ అంశానికి అంత ప్రాధాన్యత ఉండదని చైనా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ కు మద్దతుగా వ్యవహరించిన చైనా... ఇరువురు దేశాధినేతల భేటీలో ఈ అంశాన్ని పక్కన పెట్టడం గమనార్హం.

 చైనా విదేశాంగ శాఖకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ, ఇది అనధికారిక భేటీ కావడంతో అజెండాలో కశ్మీర్ అంశం ఉండకపోవచ్చని తెలిపారు. ఇరువురు నేతలు వారికి నచ్చిన అంశాలపై మాట్లాడతారని చెప్పారు. అయితే, కశ్మీర్ అంశం కీలకమైనది కావడంతో... సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని అన్నారు. కశ్మీర్ ను భారత్-పాకిస్థాన్ ల ద్వైపాక్షిక అంశంగానే చైనా పరిగణిస్తోందని చెప్పారు. మరోవైపు, కశ్మీర్ పరిణామాలపై జిన్ పింగ్ కు మోదీ వివరించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.
Go Back to Shorts
Narendra Modi
Xi Jinping
Kashmir
BJP
India
China

More Telugu News