Yadadri: హిందువుల మనోభావాలను సీఎం కేసీఆర్ దెబ్బతీశారు: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి

  • యాదాద్రిలోని స్తంభాలపై కేసీఆర్ చిత్రం, టీఆర్ఎస్ గుర్తు
  • స్తంభాలపై ఇవి చెక్కడం దారుణం
  • రాజకీయాలకు చోటిచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలోని స్తంభాలపై సీఎం కేసీఆర్ చిత్రం, టీఆర్ఎస్ గుర్తులను చెక్కడంపై టీ-కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. యాదాద్రి పుణ్య క్షేత్రంలోని అష్టభుజి ప్రాకార మండపంలోని రాతి స్తంభాలపై కేసీఆర్ చిత్రం, టీఆర్ఎస్ గుర్తు చెక్కడం దారుణమని, రాజకీయాలకు చోటివ్వడం ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. ఈ చర్యతో కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆ లేఖలో విమర్శించారు.

More Telugu News