Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి!

  • నేటితో 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్న జగన్
  • దేశంలోనే జగన్ బెస్ట్ ముఖ్యమంత్రి అన్న శ్రీవాణి
  • జగన్ అడుగుజాడల్లో దేశం నడవబోతోందని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేటితో 100 రోజుల పాలనను విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ముఖ్యమంత్రి జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రిగా నిలిచిన జగన్.. 100 రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారని ఆమె ప్రశంసించారు. పరిపాలన విషయంలో దేశం మొత్తం జగన్ అడుగుజాడల్లో నడుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు పుష్ప శ్రీవాణి ట్వీట్ చేశారు.

More Telugu News