పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త!
- 8.65 శాతానికి పెరగనున్న వడ్డీ
- ఆరు కోట్ల మంది ఖాతాదారులకు లబ్ధి
- త్వరలోనే నోటిఫికేషన్
2018-19 సంవత్సరానికి గాను పీఎఫ్పై 8.65 శాతం వడ్డీ ఇచ్చేందుకు ఈ ఏడాది ఏప్రిల్లోనే ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) సుముఖత వ్యక్తం చేసింది. ఆదాయ పన్ను విభాగం, కార్మిక శాఖ సంయుక్తంగా నోటిఫై చేస్తే ఇది అమల్లోకి వస్తుంది. ప్రకటన విడుదలైన వెంటనే ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ అవుతుంది. కాగా, ప్రస్తుతం పీఎఫ్పై 8.55 శాతం వడ్డీ లభిస్తుండగా, ఇకపై 8.65 శాతం లభించనుంది.