Guntur District: గుంటూరు జనసేన కార్యాలయం ఖాళీ... యజమానికి అప్పగింత!

  • గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్ లో కార్యాలయం
  • స్వయంగా ప్రారంభించిన రావెల కిశోర్ బాబు
  • ప్రస్తుతం బార్ అండ్ రెస్టారెంట్ కు ఇస్తానంటున్న యజమాని
గుంటూరు నగర శివారులో ఉన్న గోరంట్ల ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఏర్పాటు చేసుకున్న కార్యాలయం ఖాళీ అయింది. ఈ భవనాన్ని జనసేన నేతలు యజమానికి తిరిగి అప్పగించడంతో, అక్కడ టూలెట్ బోర్డు ఏర్పడింది. అయితే, అంతకుముందు జనసేన కోసం పెట్టుకున్న లోగోలు, పార్టీ అధినేత చిత్రాలను మాత్రం ఇంకా తొలగించలేదు.

ఈ భవనాన్ని బార్ అండ్ రెస్టారెంట్ కు అద్దెకిస్తామని యజమాని పేర్కొనడం గమనార్హం. ఈ సంవత్సరం మార్చిలో ఎన్నికలకు ముందు ఈ భవంతిలో జనసేన, తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఎన్నికలకు ముందు రావెల కిషోర్‌ బాబు తెలుగుదేశం పార్టీని వీడి, జనసేనలో చేరిన తరువాత, ఆయనే ఈ భవనాన్ని పార్టీ కార్యాలయంగా ప్రారంభించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పరాజయం తరువాత, రావెల ఈ ఛాయలకు కూడా రాలేదు. ఆయన బీజేపీలో చేరిపోయారు కూడా. దీంతో కార్యాలయం అతీగతీ పట్టించుకునే వారు లేకపోయారు. కాగా, గుంటూరుతో పాటు పలు పట్టణాలు, నియోజకవర్గాల్లోని జనసేన కార్యాలయాలు ఇప్పటికే ఖాళీ అయిన సంగతి తెలిసిందే.
Guntur District
Gorantla
Jana Sena
Pawan Kalyan

More Telugu News