అశ్లీల నృత్యాలతో హోరెత్తిన బీజేపీ ఆశీర్వాద యాత్ర
- బీజేపీ యాత్రపై తీవ్ర విమర్శలు
- వారు మహిళలు కాదన్న ఎమ్మెల్యే
- సభకు హాజరైన వారికి వినోదం కోసమేనన్న సర్పంచ్
విమర్శలపై బీజేపీ నేతలు స్పందించారు. ఆ సభను ఏర్పాటు చేసింది తాము కాదని, గ్రామ సర్పంచ్ అని థానేసర్ ఎమ్మెల్యే సుభాష్ సుధ పేర్కొన్నారు. స్టేజిపై డ్యాన్స్ చేసింది కూడా మహిళలు కాదని, ట్రాన్స్ జెండర్లని వివరణ ఇచ్చారు. సభకు హాజరైన ప్రజలకు వినోదాన్ని పంచేందుకు తానే ఈ ఏర్పాట్లు చేశానని సర్పంచ్ సునీల్ మెహ్రా తెలిపారు. ముఖ్యమంత్రి రాక ఆలస్యమవుతుందని తెలియడంతో జనాన్ని ఎంటర్టైన్ చేసేందుకు తానే ఈ నృత్యాలు ఏర్పాటు చేయించానని, వారు రెండుమూడు గంటలపాటు సంప్రదాయ నృత్యాలు చేశారని చెప్పుకొచ్చారు.