Ex- Central Minister: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి అస్వస్థత!

  • గుండె, మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న జైట్లీ
  • వైద్య చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిక
  • గత ఏడాది కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న జైట్లీ

సుమారు రెండేళ్ల నుంచి కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్యం అంతగా బాగుండని విషయం తెలిసిందే. గుండె, మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఆయన్ని చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. కాగా, గత ఏడాది జైట్లీకి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. రెగ్యులర్ మెడికల్ చెకప్ నిమిత్తం ఈ ఏడాది జనవరిలో ఆయన అమెరికా వెళ్లారు. అనారోగ్యం కారణంగా 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు.

More Telugu News