పాకిస్థాన్ రాజధానిలో 'అఖండ భారత్' ఫ్లెక్సీలు.. కలకలం!
- అఖండ భారత్ దిశగా ముందడుగు అంటూ ఫ్లెక్సీలు
- ఇస్లామాబాద్ లో పలు చోట్ల వెలసిన ఫ్లెక్సీలు
- ఫ్లెక్సీలను తొలగించిన పోలీసులు
'మహాభారత్ దిశగా ముందడుగు' అని బ్యానర్లో పేర్కొన్నారు. అంతేకాదు, అఖండ భారత్ లక్ష్యాన్ని ప్రధాని మోదీ పూర్తి చేయాలంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను బ్యానర్ పై ప్రింట్ చేశారు. ఈ బ్యానర్లను స్థానికులు చాలా సేపు ఆసక్తికరంగా చూశారు. ఆ తర్వాత కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... వారు వచ్చి ఫ్లెక్సీలను తొలగించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ లోని ప్రముఖ పత్రిక డాన్ ప్రచురించింది. మరోవైపు, దీనికి సంబంధించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.