భారీ వర్షాలకు ధ్వంసమైన పట్టాలు... ఏపీలో పలు రైళ్లు రద్దు!
- గత వారం రోజులుగా భారీ వర్షాలు
- పలు చోట్ల రైల్వే ట్రాక్ ల పైకి నీరు
- 9 రైళ్లను రద్దు చేశామన్న అధికారులు
ఏవోబీ సరిహద్దులోని డోయికళ్లు స్టేషన్ సమీపంలో ట్రాక్ దెబ్బతిన్న కారణంగా ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో, 9 రైళ్లను రద్దు చేశామని, 5 దూరప్రాంత రైళ్లను దారి మళ్లించామని అధికారులు తెలిపారు. సంబల్ పూర్ - కోరాపుట్ మధ్య తిరిగే ప్యాసింజర్ రైళ్లు, విశాఖపట్నం - రాయపూర్ మధ్య తిరిగే రైళ్లతో పాటు సంబల్ పూర్ - రాయగఢ ఎక్స్ ప్రెస్ లను రద్దు చేశామని తెలియజేశారు. పూరీ - అహ్మదాబాద్, బెంగళూరు - హతియా ఎక్స్ ప్రెస్, ధనబాద్ - అలెప్పి, విశాఖ - నిజాముద్దీన్ సమత ఎక్స్ ప్రెస్ రైళ్ల దారిని మళ్లించామని పేర్కొన్నారు.