Tamil Nadu: 75 కిలోల కారం కలిపిన నీటితో అర్చకుడికి అభిషేకం!

  • తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఘటన
  • ఆడి అమావాస్య సందర్భంగా కరుప్పుస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
  • ఆనవాయితీగా వస్తున్న కారం నీళ్ల అభిషేకం

75 కిలోల ఎండు మిరపకాయలను దంచి ఆ కారాన్ని నీటిలో కలిపి అర్చకుడిని అభిషేకించిన ఘటన తమిళనాడులో జరిగింది. ధర్మపురి జిల్లా నల్లమ్‌పల్లిలో కరుప్పుస్వామి ఆలయంలో ఆడి అమావాస్య సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. పూజా కార్యక్రమాలకు విశేషంగా హాజరైన భక్తులను ఉద్దేశించి ఆలయ అర్చకుడు ఉపదేశాలు వినిపించారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆనవాయితీగా వస్తున్న కారం కలిపిన నీటితో అర్చకుడికి ఆలయ సిబ్బంది అభిషేకం నిర్వహించారు. 

More Telugu News