cm: జగన్ గారూ, దొంగ కేసుల నుంచి రైతులను రక్షించండి: ఎంపీ కేశినేని

  • నందిగామలో రైతులు న్యాయపోరాటం చేస్తున్నారు
  • రైతులను కొట్టి వారిని పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్తున్నారు
  • ఏపీ సీఎం జగన్ వెంటనే స్పందించాలి

ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ ఎంపీ కేశినేని మరోసారి విమర్శలు చేశారు. కృష్ణా జిల్లా నందిగామలో న్యాయపోరాటం చేస్తున్న రైతులను పోలీసులు కొట్టి వారిని పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్తున్నారని, వారిపై దొంగ కేసులు నమోదు చేస్తున్నారన్న సమాచారం తమకు ఉందని పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ వెంటనే స్పందించి రైతులను రక్షించాలని, వాళ్లు నేరస్థులు కాదు ‘అన్నదాతలు’ అని కేశినేని నాని ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. 

More Telugu News