రాయ్ లక్ష్మికి షాకిచ్చిన విద్యుత్ అధికారులు!
- నెలనెలా డబుల్ అవుతున్న కరెంట్ బిల్
- ఇలా డబ్బు కట్టాలంటే బాధగా ఉంది
- ట్విట్టర్ లో వాపోయిన రాయ్ లక్ష్మీ
ఎలక్ట్రిసిటీ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే స్పందన లేదని, తనకు ఎవరైనా సాయం చేయాలని అభ్యర్థించింది. తనలాగే ఇంకా ఎంతమంది ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారోనని, ఈ సమస్య నుంచి తననెవరైనా గట్టెక్కించాలని కోరుకుంది. కష్టపడి డబ్బు సంపాదించి ఇలా కట్టాలంటే తనకెంతో బాధగా ఉందని వాపోయింది. ఆమె ట్విట్టర్ పోస్ట్ ను చూసిన ఎలక్ట్రిసిటీ బోర్డు, కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, అకౌంట్ నెంబర్, కాంటాక్ట్ వివరాలను డైరెక్ట్ మెసేజ్ చేస్తే, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.